SRD: ఖేడ్ నియోజకవర్గంలోని అభివృద్ధి కార్యక్రమాల కోసం నిధులు మంజూరు చేయాలని ఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి జిల్లా ఇంఛార్జ్ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామిని కోరారు. ఈ మేరకు ఈరోజు హైదరాబాదులో సమావేశమై, ఎమ్మెల్యే వినతి పత్రాన్ని సమర్పించారు. ఖేడ్ నియోజకవర్గ అభివృద్ధికి అవసరమైన నిధులు మంజూరు చేసే దిశగా మంత్రి సానుకూలంగా స్పందించినట్టు ఎమ్మెల్యే తెలిపారు.