WGL: నర్సంపేట డిపో నుంచి శ్రీశైలం, మహానంది, బనగానపల్లె, యాగంటి, అలంపూర్ జోగులాంబ అమ్మవారి శక్తి పీఠం & స్వర్ణగిరి దర్శనాల కొరకు సూపర్ లగ్జరి బస్సు ఈ నెల 13న బయలుదేరనున్నట్లు డిపో మేనేజర్ ప్రసూన లక్ష్మీ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. టికెట్ ధర ఒక్కరికి రూ.2500 ఉంటుంది అన్నారు. 3రోజుల ప్రయాణం ఉంటుందని, బుకింగ్ కోసం 9704644543 సంప్రదించాలన్నారు.