BDK: ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి రాజ్యసభకు ఎన్నికైన సందర్భంగా కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు ఆయనను బుధవారం మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన నివాసంలో కూనంనేని సాంబశివరావు పుష్పగుచ్ఛం అందజేసి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజల సమస్యల పరిష్కారానికి రాజ్యసభలో సమర్థంగా సేవలందించాలని ఆకాంక్షించారు.