TG: ప్రైవేట్ స్కూళ్లలో ఫీజుల దందా అరికట్టేందుకు ప్రభుత్వం రెడీ అవుతోంది. దీని కోసం ప్రత్యేక చట్టం తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తుంది. ఈనెల 16 నుంచి జరిగే బడ్జెట్ సమావేశాల్లోనే అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టాలని విద్యాశాఖ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల తెలంగాణ విద్యా కమిషన్ తన నివేదికను సీఎం రేవంత్ రెడ్డికి అందజేసింది. అందులో ప్రధానంగా ఫీజుల నియంత్రణపై ఉన్నట్లు సమాచారం.