MNCL: బెల్లంపల్లి టూ టౌన్ నూతన ఎస్సైగా సీహెచ్. తిరుపతి సోమవారం బాధ్యతలు చేపట్టారు. గతంలో మంచిర్యాల ఎస్సైగా పనిచేసిన ఆయన, బదిలీపై ఇక్కడికి వచ్చారు. శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తానని, అక్రమ కార్యకలాపాలపై కఠినంగా వ్యవహరిస్తానని ఆయన స్పష్టం చేశారు. శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.
వార్తలు
నూతన ఎస్సైగా బాధ్యతలు స్వీకరణ
Advertisement
Advertisement
Advertisement


