దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ లాభాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి అందిన సానుకూల సంకేతాలతో సెన్సెక్స్ 639.82 పాయింట్లు లాభపడగా, నిఫ్టీ 233.55 పాయింట్ల లాభంతో 24,261.60 వద్ద స్థిరపడింది. ప్రధానంగా ఐటీ, బ్యాంకింగ్ రంగాల షేర్లు రాణించడంతో మార్కెట్లు పరుగులు తీశాయి. గత కొన్ని రోజులుగా ఒడిదొడుకుల మధ్య సాగుతున్న మార్కెట్లలో ఈ లాభాలు ఇన్వెస్టర్లకు ఊరటనిచ్చాయి.