CTR: ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వన్యమృగాల సంచారం ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. కల్లూరు, కుప్పం, యర్రావారిపాలెం ప్రాంతాల్లో ఏనుగుల సంచారం కొనసాగుతుండగా, బైరెడ్డిపల్లె మండలంలో తాజాగా చిరుత ఒక ఆవును చంపినట్లు స్థానికులు తెలిపారు. దీంతో అటవీ ప్రాంతాల సమీపంలో నివసించే ప్రజలు భయాందోళనలో జీవిస్తున్నారు.