క్రికెట్ ప్రపంచంలో భారత్-పాకిస్తాన్ మ్యాచ్కు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. తాజాగా టీ20 ప్రపంచకప్లో ఈ రెండు జట్ల మధ్య జరిగిన పోరు వ్యూవర్షిప్ రికార్డులను తిరగరాసింది. అయితే, ఈ దాయాది జట్లు మరో కీలక టోర్నీలో తలపడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది సెప్టెంబర్లో జరిగే ఆసియా గేమ్స్లో క్రికెట్ కూడా ఉండటంతో, అక్కడ IND-PAK పోరు జరిగే అవకాశం ఉంది.