RR: ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా చేవెళ్ల మండలంలోని అంతారం గ్రామంలో సర్పంచ్ రామస్వామి ఆధ్వర్యంలో పల్లె ప్రకృతి పరిసరాల్లో స్వచ్ఛత కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్వయంగా చెత్తను తొలగించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. అనంతరం ZPHS పాఠశాలలో తడి, పొడి చెత్తపై అవగాహన కల్పించారు.