భద్రాద్రి: భద్రాచలం రామాలయంలో ఆలయ హుండీలను సోమవారం లెక్కించారు. 39 రోజులకు హుండీల ద్వారా 1,05,94,090 ఆదాయం లభించిందని ఆలయ ఈవో దామోదర్ రావు తెలిపారు. నగదుతో పాటు 80 గ్రాముల బంగారం, 650 గ్రాముల వెండి వచ్చాయన్నారు. అమెరికా డాలర్లు 91.కెనడా డాలర్లు 5.ఓమన్ రాయల్ 1/2 రాయల్, మలేషియా రింగెట్స్ 20 వియత్నామీస్ డాంగ్ 5000, న్యూజిలాండ్ డాలర్స్ 110 వచ్చాయన్నారు.