BDK: కొత్తగూడెం మండలంలో మంగళవారం భారీ వర్షం కురిసింది. గత రెండు రోజులుగా ఉక్కపోతతో ఇబ్బందులు పడిన ప్రజలకు ఈ వాన ద్వారా ఉపశమనం లభించింది. వర్షంతో ఇటీవల నాటిన పత్తి విత్తనాలు మొలకెత్తే అవకాశం ఉందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కాగా, మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
వార్తలు
VIDEO: కొత్తగూడెంలో భారీ వర్షం.. ప్రజలకు ఊరట
Advertisement
Advertisement
Advertisement


