KMR: విద్యార్థులకు విద్యాబుద్ధులు అందించాల్సిన ఉపాధ్యాయులు బాధ్యతారాహిత్యంగా పాఠశాలలోనే రక్తం వచ్చేదాకా కొట్టుకున్న ఘటన నసురుల్లాబాద్ మండలం బొమ్మన్ దేవ్ పల్లి జిల్లా పరిషత్ ప్రభుత్వ హైస్కూల్లో చోటు చేసుకుంది. ఉపాధ్యాయుడు నంద్యాల శ్రీనివాస్, హెడ్ మాస్టర్ ఆనంద్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాఘవేంద్ర సోమవారం తెలిపారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.