NGKL: ఉప్పునుంతల మండల వ్యాప్తంగా నేటి నుంచి ఏప్రిల్ 9 వరకు పాడి పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా తొలిరోజైన నేడు మామిళ్లపల్లి గ్రామంలో ఉదయం 9 గంటలకు టీకాల పంపిణీ కార్యక్రమం ప్రారంభం కానుంది. టీకా వేయించుకునే సమయంలో రైతులు తమ ఆధార్ కార్డు, మొబైల్ ఫోన్ వెంట తెచ్చుకోవాలన్నారు.