AKP: ఎలమంచిలి రైల్వే స్టేషన్ రోడ్డులో పాన్ షాప్ పై సోమవారం దాడి చేసినట్లు ఎస్సై సావిత్రి తెలిపారు. ఈ దాడిలో 6 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. స్థానిక గాంధీనగర్కు చెందిన ఎన్. సూరిబాబు అనధికారికంగా పాన్ షాప్లో మద్యం బాటిళ్లు నిల్వ ఉంచినట్లు పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.