ఏలూరు: ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్లో 48 ఫిర్యాదులు అందినట్లు ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ తెలిపారు. ఫిర్యాదుదారులతో నేరుగా మాట్లాడిన ఆయన సమస్యలను పరిశీలించి, పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఆన్లైన్లో ఫిర్యాదు చేయాలనుకునేవారు వెబ్సైట్లో నమోదు చేసుకోవచ్చని చెప్పారు.