TG: రాజకీయాలు కలుషితం అవుతున్నాయని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. కొందరు రాజకీయ నేతలు ధనార్జనపైనే దృష్టి పెడుతున్నారని విమర్శించారు. రాజకీయాల్లో ప్రక్షాళన అవసరమని తెలిపారు. మావోయిస్టులు ప్రజల్లోకి రావడం శుభపరిణామం అని కొనియాడారు. కాంగ్రెస్ సోషల్ సెక్యులర్ పార్టీ అని అన్నారు. ప్రజాసేవ కోసం వచ్చేవారిని ఆహ్వానిస్తామన్నారు.