ఉమ్మడి వరంగల్ జిల్లాలో వేసవికాలం పూర్తిగా ప్రారంభం కాకముందే భానుడు భగభగమంటున్నాడు. మార్చి మొదటి వారంలోనే ఉష్ణోగ్రతలు 30 నుంచి 35 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదవుతున్నాయి. ఉదయం 11 గంటల నుంచే ఎండ ప్రతాపం తీవ్రంగా కనిపిస్తోంది. మధ్యాహ్నం సమయంలో బయటకు రావాలంటే ప్రజలు జంకుతున్నారు. ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య సిబ్బంది సూచిస్తున్నారు.