BHPL: గోరికొత్తపల్లి మండలం నిజాంపల్లి గ్రామంలోని మహిళలందరికీ ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సర్పంచ్ సునీత-రవీందర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని అన్నారు. సమాజ నిర్మాణంలో మహిళల పాత్ర అపారమని, కుటుంబం నుంచి దేశ నిర్మాణం వరకు సత్తా చాటుతున్నారని సర్పంచ్ పేర్కొన్నారు.