AP: పశ్చిమబెంగాల్లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పర్యటనలో ప్రొటోకాల్ వైఫల్యంపై సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. రాష్ట్రపతి పదవిని ఏ ప్రభుత్వమైనా అత్యున్నత గౌరవ మర్యాదలతో చూడాలని తెలిపారు. బెంగాల్ పర్యటనలో రాష్ట్రపతి ఆవేదన వ్యక్తం చేయడం బాధగా అనిపించిందని అన్నారు. ప్రజాస్వామ్యంలో రాజకీయాల కంటే రాజ్యాంగ సంస్థలు ఉన్నతమైనవని చంద్రబాబు పేర్కొన్నారు.