NLG: నార్కట్పల్లి మండలం మాదవడవల్లి లో సామ తనుష్ రెడ్డి (19) అనే విద్యార్థి శనివారం మధ్యాహ్నం తన ఇంట్లో ఫ్యానుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో వ్యక్తిగత కారణాలతో ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు సమాచారం. మృతుని తండ్రి వెంకటరెడ్డి ఫిర్యాదు మేరకు నార్కట్పల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.