W.G: తాళ్లకోడు ఎన్టీఆర్ కాలనీ లబ్ధిదారులకు గృహ నిర్మాణ రుణాలు మంజూరు చేయాలని సీపీఎం ఆకివీడు శాఖ డిమాండ్ చేసింది. ఈ మేరకు శనివారం ఎంపీడీవో కార్యాలయంలో హౌసింగ్ ఏఈకి వినతిపత్రం అందజేశారు. గత అక్టోబర్ నుంచి 400 మంది దరఖాస్తు చేసుకున్నా, రుణాలు మంజూరు కాలేదని నేతలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తవిటి నాయుడు, వర్మ, పెంకి అప్పారావు తదితరులు పాల్గొన్నారు.