HNK: కాజీపేట పట్టణంలోని మడికొండలో శాంతమ్మ అనే వృద్ధురాలిపై కొడుకు, కోడళ్లు దాడి చేశారు. ఈ దాడిలో వృద్ధురాలికి తల పగిలి, ఎడమ చేయి విరిగింది. విషయం తెలుసుకున్న మడికొండ ఇన్స్పెక్టర్ పుల్యాల కిషన్ నడవలేని స్థితిలో ఉన్న బాధితురాలి ఇంటికి స్వయంగా వెళ్లి కేసు నమోదు చేశారు. వృద్ధులను వేధించడం, కొట్టడం వంటి చర్యలకు కఠిన చర్యలు తప్పవని ఇన్స్పెక్టర్ హెచ్చరించారు.