KDP: అమెరికా సామ్రాజ్య వాదం, ఇజ్రాయిల్ దురాక్రమణ విధానాలతో ఇరాన్పై దాడి చేయడం దుర్మార్గమని CPI ML లిబరేషన్ జిల్లా స్టాండింగ్ కమిటీ మెంబర్ చంద్రశేఖర్ విమర్శించారు. శనివారం బద్వేలులో ఆయన మాట్లాడుతూ.. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయిల్ చేస్తున్న యుద్ధంలో అమాయకులైన ప్రజలు, చిన్నారులు చనిపోయారన్నారు. స్కూలుపై బాంబు దాడి జరగడంతో 160 మంది విద్యార్థులు మృతి చెందినట్లు తెలిపారు.