SRCL: వేములవాడలోని గుడి చెరువు ‘తూము’ ద్వారా సాగునీటిని శనివారం ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ విడుదల చేశారు. ఎండల తీవ్రత దృష్ట్యా పంటలు ఎండిపోకుండా ఉండేందుకు ప్రతి ఏటా లాగే ఈ ఏడాది కూడా నీటిని విడుదల చేసినట్లు తెలిపారు. దీనివల్ల ఆయకట్టు రైతులకు మేలు జరుగుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ పుల్కం రాజు, వైస్ ఛైర్మన్ నరాల శేఖర్ పాల్గొన్నారు.