MDK: రామాయంపేట రేంజ్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ గీత అగర్వాల్ అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. అటవీ శాఖలో ఆమె అందిస్తున్న విశిష్ట సేవలకు గుర్తింపుగా రాష్ట్ర స్థాయి ‘ఉత్తమ మహిళా ఉద్యోగి’ అవార్డుకు ఎంపికయ్యారు. దూలపల్లిలోని ఫారెస్ట్ అకాడమీలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర అదనపు డీజీపీ స్వాతి లక్రా, అటవీ శాఖ ఉన్నతాధికారుల చేతుల మీదుగా ఆమె అవార్డును స్వీకరించారు.