KNR: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎండలు తీవ్రంగా పెరిగాయి. మార్చి మొదటి వారంలోనే ఉష్ణోగ్రతలు 38 డిగ్రీలకు పైగా నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు దాహార్తి తీర్చుకోవడానికి మళ్లీ సంప్రదాయ మట్టి కుండలను ఉపయోగిస్తున్నారు. ప్లాస్టిక్ బాటిళ్లు, ఫ్రిజ్ వాడకం వల్ల మట్టి కుందాలకు తగ్గిన డిమాండ్, ఇప్పుడు ఆరోగ్య స్పృహతో మళ్లీ పెరుగుతోంది.