MHBD: తొర్రూరు మండలంలోని అమ్మాపురం గ్రామానికి చెందిన గూడెల్లి నారాయణ (52) మేస్త్రీ పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ క్రమంలో పని చేస్తున్న ప్రదేశంలో పాము కాటుకు గురి కావడంతో కుటుంబసభ్యులు వరంగల్ ఎంజీఎం అస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.