GDWL: అలంపూర్లో వెలిసిన జోగులాంబ దేవి బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను శనివారం తెలంగాణ మాజీ గవర్నర్, ప్రస్తుత మహారాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సతీమణి సుధాదేవ్ వర్మ దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఆమెకు పూర్ణకుంభంతో స్వాగతం పలికి ఉభయ ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం శేష వస్త్రంతో సత్కరించి, తీర్థ ప్రసాదాలు అందజేశారు.