రణ్వీర్ సింగ్, ఆదిత్య ధర్ కాంబోలో వస్తున్న చిత్రం ‘దురంధర్ 2’ ఈనెల 19న విడుదల కానుంది. దాదాపు 4 గంటల నిడివి గల ఈ సినిమా కోసం ఈనెల 18 సాయంత్రం 5 నుంచే పెయిడ్ ప్రివ్యూస్ నిర్వహించాలని జియో స్టూడియోస్ నిర్ణయించింది. షోల సంఖ్య పరిమితంగా ఉన్నందున, ముందుగానే పాజిటివ్ టాక్ తెచ్చి సినిమాకు బూస్ట్ ఇవ్వాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.