BHPL: జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి సమక్షంలో శాయంపేట మండలం సూర్యనాయక్ తండాకు చెందిన పలు పార్టీల నేతలు BRS పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఇటీవల నూతన గ్రామ అధ్యక్షుడిగా ఎన్నుకున్న మాలోతి తిరుపతిని ప్రత్యేకంగా అభినందించి కృతజ్ఞతలు తెలిపారు.