కేరళలోని కొచ్చి తీరానికి ఇరాన్ యుద్ధ నౌక ఐరిస్ లావన్ వచ్చింది. ఇటీవల విశాఖలో జరిగిన ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూకు వచ్చిన నౌకకు తిరుగు ప్రయాణంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో కొచ్చి ఓడరేవులో నిలిపేందుకు అనుమతి ఇవ్వాలని FEB 28న భారత్ను ఇరాన్ కోరినట్లు తెలుస్తోంది. అలాగే, నౌకలోని 183 మంది సిబ్బందికి కొచ్చి నౌకాదళ కేంద్రాల్లో వసతి కల్పించారు.