BPT: రాష్ట్రస్థాయి యోగాసన పోటీల్లో జె.పంగులూరు మండలం చందలూరు జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థిని శృతి సత్తా చాటింది. ఈ నెల 18న జరిగిన రాష్ట్రస్థాయి యోగాసన పోటీల్లో సంప్రదాయ యోగాసనాల విభాగంలో ఆమె ప్రథమ బహుమతిని గెలుచుకుంది. క్రమశిక్షణ, నిరంతర సాధనతోనే ఈ విజయం సాధ్యమైందని శుక్రవారం పాఠశాల యాజమాన్యం శృతిని అభినందించారు.
వార్తలు
యోగాసన పోటీల్లో సత్తా చాటిన విద్యార్థిని
Advertisement
Advertisement
Advertisement


