JGL: ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా బుగ్గారం మండలం సిరికొండ గ్రామంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. సర్పంచ్ పంచిత ధర్మరాజు అధ్యక్షతన గ్రామ పంచాయతీ నుంచి ర్యాలీ చేపట్టి ప్రభుత్వ కార్యాలయాలు పరిశుభ్రంగా ఉంచాలని, అనవసర చెత్త తొలగించాలన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. గ్రామంలో వృథా నీరు నిల్వ కాకుండా ప్రతి ఒక్కరు ఇళ్ల పరిసరాలను శుభ్రంగా ఉంచాలన్నారు.