VKB: జిల్లా కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన దీపక్ తివారి రంగారెడ్డి ఐడీఓసీకి చేరుకున్న ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబును కలిశారు. ఈ సందర్భంగా మంత్రికి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించినట్లు తెలిసింది. కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత దీపక్ తివారి మొదటిసారిగా మంత్రిని కలిశారు.