ATP: రెడ్డిపల్లి పశుసంవర్ధక శిక్షణ కేంద్రంలో ప్రభుత్వ పథకాల పురోగతిపై MP అంబికా లక్ష్మీనారాయణ శుక్రవారం సమీక్ష నిర్వహించారు. జిల్లాను కరవురహితంగా మార్చడంలో పశుసంవర్ధక రంగం కీలకమని ఆయన పేర్కొన్నారు. ప్రతి ఇంట్లో పాడి పశువు ఉంటే రైతులకు అదనపు ఆదాయం లభిస్తుందని వివరించారు. శాఖలోని ఖాళీల భర్తీ, పశుగణ బీమా నిధుల మంజూరుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.