MDK: తూప్రాన్ మండలంలో ప్రారంభమైన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాలను అధికారులు పరిశీలించారు. యావాపూర్ గ్రామంలో జరుగుతున్న ప్రగతి ప్రణాళిక కార్యక్రమాలను తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి పరిశీలించి, పనుల పురోగతిపై సిబ్బందికి సూచనలు ఇచ్చారు. అలాగే నర్సంపల్లి గ్రామంలో గ్రామ పంచాయతీ భవనం మహిళా భవనాల్లో చేపట్టిన శుభ్రత కార్యక్రమాలను ఎంపీడీవో సతీష్ తనిఖీ చేశారు.