E.G: కడియం ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఎన్నికలు శనివారం ఏకగ్రీవం అయ్యాయి. అధ్యక్షునిగా చిక్కాల సూరిబాబు ఎంపికయ్యారు. ఉపాధ్యక్షునిగా యండమూరి శ్రీనివాస్, గౌరవ అధ్యక్షులుగా పాలగుమ్మి శేషగిరి, బొమ్మిరెడ్డి బ్రహ్మాజీ లు, కార్యదర్శిగా అన్నందేవుల సూర్యచంద్రరావు, కోశాధికారిగా కొప్పిశెట్టి సుబ్రహ్మణ్యం, సలహాదారుడిగా పళ్ళ వెంకటగిరిను ఎన్నుకున్నారు.