GNTR: మంగళగిరిలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో మరిన్ని మెరుగైన వసతి సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ఆసుపత్రి అభివృద్ధి, సౌకర్యాలపై అధికారులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎయిమ్స్ను ఆంధ్రప్రదేశ్కు ప్రతిష్ఠాత్మకమైన రీసెర్చ్, అకాడమిక్ సంస్థగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు.