SRD: సదాశివపేట మండల పరిధిలోని మద్దికుంట రైతు వేదికలో శుక్రవారం రైతులకు సమావేశపరిచి ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రస్తుతం యాసంగిలో రైతులు సాగు చేస్తున్న వరి, మొక్క జొన్న పంటలపై రైతులకు తగిన సలహాలు సూచనలు ఇచ్చారు. రైతులు యాజమాన్యం పద్ధతులు పాటించి సస్యరక్షణ చర్యలు తీసుకోవాలని వ్యవసాయ అధికారులు రైతులకు సూచించారు.