ఖమ్మంలోని అంబేద్కర్ భవన్, టీటీడీసీల్లో కనీస సౌకర్యాలు అందుబాటులో లేవని పునరావాసం పొందుతున్న వెలుగుమట్ల భూదాన్ భూముల బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాష్ రూమ్, ఇతర సౌకర్యాలు లేక అవస్థలు పడుతున్నామని ఆగ్రహం వ్యక్తం చేశారు. భోజనాలు కూడా స్వచ్ఛంద సంస్థలు మాత్రమే అందిస్తున్నాయని వాపోతున్నారు. పునరావాస కేంద్రాల్లో సౌకర్యాలు కల్పించాలని కోరారు.