KRNL: ఆదోనిలోని జాతీయ వ్యవసాయ మార్కెట్ యార్డుకు ఈ ఏడాది రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చిందని శుక్రవారం యార్డు కార్యదర్శి గోవిందు తెలిపారు. 2025-26 సంవత్సరానికి ప్రభుత్వం రూ.18 కోట్ల ఆదాయ లక్ష్యం నిర్దేశించగా, ఇప్పటికే రూ.18.40 కోట్లు వసూలయ్యాయని చెప్పారు. రైతులకు పంటలు బాగా దిగుబడి రావడంతో యార్డులో క్రయవిక్రయాలు ఎక్కువగా జరిగాయని తెలిపారు.