అనంతపురం ఆదిమూర్తి నగర్లోని ఉపాధ్యాయ భవన్ వద్ద చెత్తను తగలబెట్టడంతో నగరవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ చెత్తను డంపింగ్ యార్డుకు తరలించాల్సి ఉండగా కాల్చడంతో విషవాయువులు వ్యాపిస్తున్నాయని వాపోతున్నారు. చెత్తలో ప్రైవేట్ ఆసుపత్రి వ్యర్థాలు కూడా ఉన్నట్లు ఆరోపిస్తూ, అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.