KMM: పాత కక్షల నేపథ్యంలో ఓ వ్యక్తిపై కత్తితో దాడి చేసిన ఘటన కూసుమంచి మండలంలోని లోక్య తండాలో శుక్రవారం తెల్లవారుజామున జరిగింది. గ్రామానికి చెందిన వడిత్య హేమ్లపై మస్తాన్, తేజవత్ నాగేంద్రబాబులు కాపుకాచి దాడికి పాల్పడ్డారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దాడిలో తీవ్రంగా గాయపడిన హేమ్లను చికిత్స నిమిత్తం స్ధానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘనటపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.