MDK: రేగోడ్ మండలం మక్తా వెంకటాపూర్ సర్పంచ్ సంగమేశ్వర్ ఆధ్వర్యంలో కొండాపూర్ నుంచి తిమ్మాపూర్ వరకు నూతన బాట నిర్మాణ పనులు నిన్న ప్రారంభమయ్యాయి. ఈ కొత్త మార్గం అందుబాటులోకి రావడం వల్ల గ్రామాల మధ్య ఏకంగా 7 కిలోమీటర్ల దూరం తగ్గనుంది. దీనివల్ల రైతులకు, గ్రామస్థులకు ప్రయాణ సౌకర్యం మెరుగుపడటంతో పాటు సమయం ఆదా అవుతుందని సర్పంచ్ తెలిపారు.