ADB: బోథ్ మండలంలోని కరత్వాడలో చిరుతపులి కలకలం రేపింది. గ్రామానికి చెందిన రైతు గంగయ్యకు చెందిన ఆవుపై చిరుత దాడి చేసి హతమార్చింది. సమాచారం అందుకున్న అటవీ అధికారులు సీసీ కెమెరాలను పరిశీలించగా, గురువారం తెల్లవారుజామున 5 గంటలకు ఈ దాడి జరిగినట్లు గుర్తించారు. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.