ATP: రాయదుర్గం నియోజకవర్గ YCP పరిశీలకులుగా డాక్టర్ బత్తల హరిప్రసాద్ నియమితులయ్యారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకం జరిగినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం రాష్ట్ర కార్యనిర్వాహక మండలి సభ్యుడిగా ఉన్న ఆయనకు ఈ అదనపు బాధ్యతలు అప్పగించారు. నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని ఆయన తెలిపారు.