MDK: మనోహరాబాద్ లో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక పై ఎంపీడీవో ప్రీతి రెడ్డి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈనెల 6 నుంచి 15 వరకు నిర్వహించే ప్రణాళికలపై చర్చించారు. పంచాయతీ కార్యదర్శులు, మండల స్థాయి అధికారులతో వేరువేరుగా సమావేశం నిర్వహించి ప్రజా పాలన లో ప్రగతి ప్రణాళిక విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఎంపీడీవో సూచించారు.