KNR: జీపీ కార్మికులను కాంగ్రెస్ మోసం చేసిందని, సీఐటీయూ జిల్లా కార్యదర్శి కొప్పుల శంకర్ అన్నారు. ఆకునూరి సుధాకర్ అధ్యక్షతన హుజురాబాద్ హమాలీ యూనియన్ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. జీపీ కార్మికులకు మూడు నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం వేతనాలు చెల్లించడం లేదని అన్నారు. మేనిఫెస్టోలో పెట్టిన విధంగా పంచాయతీ కార్మికులకు కనీస వేతనం అమలు చేయాలన్నారు.