KRNL: సి.బెళగల్ గ్రామాలలో రైతులు, ప్రజలు సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని సి.బెళగల్ మండల వ్యవసాయ అధికారి మల్లేష్ కుమార్ అన్నారు. గురువారం మండల పరిధిలోని పీఎం శ్రీ, మోడల్ స్కూల్ విద్యార్థులకు భూసార పరీక్షల నమూనాల సేకరణ, మట్టి పరీక్షలపై అవగాహన కల్పించారు. నేల ఆరోగ్యంగా ఉన్నప్పుడే రైతులకు సమృద్ధిగా పంటలు పండుతాయని విద్యార్థులకు తెలియజేశారు.