భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నట్లు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. గురువారం జిల్లాలోని 37 పరీక్షా కేంద్రాల్లో గణితశాస్త్రం, జూలజీ, హిస్టరీ పరీక్షలు సజావుగా నిర్వహించబడ్డాయి. మొత్తం 8,640 మంది విద్యార్థులకు పరీక్షలు ఉండగా 8,219 మంది హాజరయ్యారు.